సీఎం జగన్ మహిళలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు: నారా లోకేష్

-

సీఎం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్. ఆడబిడ్డలు బలైపోతుంటే.. సీఎం జగన్ మహిళలను అవహేళన చేసే విధంగా మాట్లాడటం విచారకరం అని వ్యాఖ్యానించారు. విజయవాడ, గుంటూర్ లో ఏదో జరిగిందని నానా యాగీ చేస్తున్నామంటూ సీఎం అవహేళన చేస్తున్నారని విమర్శించారు. ఇటాంటి ఘటన సీఎం ఇంట్లో జరిగితే ఇంతే వెటకారంగా మాట్లాడుతారా ముఖ్యమంత్రి గారూ అంటూ ప్రశ్నించారు. మరోవైపు మహిళ హోం మంత్రి పెంపకంలో తేడా వలనే రేప్ లు జరుగుతున్నాయంటూ మహిళల్ని అవమానపరుస్తున్నారని విమర్శించారు. ఒక యువతి ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైతే… ప్రతిపక్షాలు యాగీ చేస్తున్నాయని అనడం సబబేనా అంటూ ప్రశ్నించారు లోకేష్. అంబులెన్స్ మాఫియా వేధింపులు తట్టుకోలేక ఒక తండ్రి బిడ్డ మృత దేహాన్ని తీసుకెళ్తే టీడీపీ యాగీ చేస్తుందనడం కరక్టేనా అని ప్రశ్నించారు. మీ మనస్సాక్షిని ఓ సారి ప్రశ్నించుకోండని సీఎం జగన్ కు హితవు పలికారు. ఈ రోజు జగనన్న విద్యాదీవెన ప్రారంభోత్సవంలో ప్రతిపక్షాలు కొన్ని సంఘటనలపై నానా యాగీ చేస్తున్నాయని జగన్ విమర్శించారు. దీనికి ప్రతిగా లోకేష్ కౌంటర్ గా  ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version