తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీ మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఏపీలో కరెంట్, నీటి సమస్యలు ఉన్నాయని, రోడ్లు బాగా లేవని మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. కేటీఆర్ ఏపీ గురించి ఈ వ్యాఖ్యలు చేసి ఉండకపోవచ్చని.. ఒక వేళ ఏపీ గురించే వ్యాఖ్యానిస్తే వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాపును చూసి బలపు అనుకుంటే ఎలా..? అంటూ వ్యాఖ్యానించారు.
వాపును చూసి బలుపు అనుకుంటే ఎలా..? కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్
-