ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్..!

-

ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ కార‌ణంగా చాలామంది త‌మ టికెట్ల‌ను ఇచ్చిన గడువులోపు ర‌ద్దు చేసుకోలేక‌పోయారు. అలాంటి ప్రయాణికుల కోసం టికెట్ కాన్సిలేషన్ పాలసీని సవరించింది. టికెట్ల‌కు డబ్బు తిరిగి ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మ‌ధ్య రిజ‌ర్వేష‌న్ చేసుకున్న వారికి కూడా అవ‌కాశం క‌ల్పిస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈనెల 29 లోపు ప్ర‌యాణికులు వారి టికెట్ల‌ను రద్దు చేసుకోవ‌చ్చంటూ తెలిపింది.

ప్రయాణికులు తమకు ద‌గ్గ‌ర్లోని బ‌స్టాండు లేదా ఏటీబీ కౌంటర్‌లో టికెట్ చూపించి క్యాన్సిల్ చేసుకోవ‌చ్చ‌ని ఆర్టీసీ తెలిపింది. ప్ర‌యాణికులంద‌రూ ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాలంటోంది. కరోనా కష్ట కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలకు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version