నీ అయ్యను చెప్పుతో కొట్టానా – కవితకు అరవింద్ కౌంటర్

-

తన ఇంటిపై దాడి చేసిన సంఘటనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండించిన ఎంపీ ధర్మపురి అరవింద్.. విమర్శలు చేస్తే దాడులు చేస్తారా? అని నిలదీశారు. మా అమ్మను భయపెట్టించారు.. ఇంటిపై దాడి చేసి మహిళలను భయపెట్టించారు..నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పోటీ చేస్తుందా? అని ఫైర్‌ అయ్యారు ధర్మపురి అరవింద్.

కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగిందన్నారు. టీఆర్ఎస్ గూండాలు ఇంట్లో వస్తువులు పగులకొట్టి బీభత్సం సృష్టించారు.. ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూసి దాడి చేయడం తప్పు.. కవితకు ఇంత కుల అహంకారం ఎందుకు? అని నిలదీశారు ధర్మపురి అరవింద్. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల దాడులకు తామ అస్సలు భయపడబోమన్నారు. నీ అయ్యను చెప్పుతో కొట్టానా..నువ్వు నన్ను ఎందుకు కొడతావని కవితకు అరవింద్ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version