తండ్రిని తిట్టిన కేటీఆర్ కి ఆ అర్హత లేదు !

-

అబద్దాలు చెప్పడంలో కేటీఆర్ తన తండ్రిని మించిపోయాడని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కేటీఆర్ కు మంత్రి పదవి తన తండ్రిపెట్టిన భిక్ష అని విమర్శించిన ఆయన కేసీఆర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తే తండ్రిని తిట్టిన కేటీఆర్ కి బీజేపీ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన 224 కోట్ల విపత్తు నిధుల నుంచే 10వేలు పంచుతున్నారన్న ఆయన దానికి పెద్దగా డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు.

అభిషేక్ అనే బీజేపీ కార్యకర్త ఇల్లు మునిగింది, అలాంటప్పుడు ప్రభుత్వం ఇచ్చే సహాయం తీసుకుంటే తప్పేంటి ? సహాయం అందని వారికోసం మళ్ళీ ఆందోళన చేస్తే తప్పేలా అవుతుంది ? అని ఆయన ప్రశ్నించారు. అలాంటి కార్యకర్త ఉన్నందుకు గర్వపడుతున్నామన్న ఆయన ఆయనకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో మిమ్మల్ని ఏడు చెరువుల నీళ్లు తాగించామని వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో ఓడటం ఖాయామని అన్నారు. ఓవైసీ కి చెంచాగిరి చేయడమే పాలన కాదన్న ఆయన ఫామ్ హౌజ్ లో పడుకునే కేసీఆర్ 4 లక్షల పదివేల జీతం తీసుకుంటున్నాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version