ఆ విషయంలో చాలా బాధపడ్డా.. సాయి పల్లవి..?

-

తన సహజమైన నటనతో అందంతో డ్యాన్స్ తో ఎంతోమంది కుర్రకారులను తన వైపు తిప్పుకున్న సాయి పల్లవి స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ లో సపరేటు క్రేజీ సంపాదించిందని చెప్పవచ్చు. ఈమె పేరు చెబితే కుర్రకారులకు అభిమానులకు సంథింగ్ స్పెషల్ అని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. గత సంవత్సరం విడుదలైన విరాటపర్వం, గార్గి వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ లో ఈమె పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా తనకు మేకప్ లేకుండా నటించడానికి గల కారణాలను వివరించింది.

తనకు చిన్న వయసు నుంచి ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యేదాన్ని వాయిస్ పెద్దగా బాగోలేదు మొహం మీద మొటిమలు ఇలా చాలా విషయాలలో తనను బాధపెట్టాయని తెలిపింది సాయి పల్లవి. అందుకే మొదటి నుంచి తాను పెద్దగా మేకప్ ఉపయోగించుకోనని.. తన మొదటి సినిమా ప్రేమమ్ లో కూడా మేకప్ లేకుండానే న్యాచురల్ గా కనిపించానని ఆ సమయంలో ఆడియన్స్ తనని ఎలా రిసీవ్ చేసుకుంటారో అంటూ చాలా భయపడిపోయారని తెలిపింది. కానీ తను అనుకున్నట్లుగానే తనని తనలాగే అభిమానులు ఇష్టపడ్డారని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

ఇక ఈ పాత్రను ఇష్టపడడం చూసి తనకు కూడా మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని అందుకే అప్పటినుంచి సినిమాలలో మేకప్ లేకుండానే నటిస్తూ ఉన్నానని తెలుపుతోంది.ఈ విషయంలో దర్శక, నిర్మాతలు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని తెలుపుతోంది ఈ ముద్దుగుమ్మ. ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది అప్పటినుంచి టాలీవుడ్ లో ఈమె హవా కొనసాగిస్తూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version