ఎట్టకేలకు టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన అచ్చెన్నాయుడు

-

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడుగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన నిన్న బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఆయన అధ్యక్షుడిగా నియమితులు అయినా అప్పట్లో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావించారు. కానీ కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు.

atchannaidu

అక్టోబర్‌ లో అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియమితులైనా ఇప్పటి దాకా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు నిన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేతుల మీదుగా సోమవారం సాయంత్రం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడికి చంద్రబాబు గౌరవించారు. తను నిలబడి, అచ్చెన్నాయుడిని సీట్లో కూర్చోబెట్టారు చంద్రబాబు. ఇక బాధ్యతలు స్వీకరించిన అనంతరం అచ్చెన్నాయుడు తనకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన చంద్రబాబు చంద్రబాబు పాదాలు తాకి, ఆశీర్వాదం తీసుకున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version