ఏలూరులో దారుణం.. విద్యార్థినులపై హాస్టల్ వార్డెన్ భర్త లైంగిక‌ దాడి!

-

ఏపీలోని ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ వసతి గృహంలో ఉండే విద్యార్థినులను కంటికిరెప్పలా కాపాడాల్సిన వార్డెన్ తన బాధ్యతను విస్మరించింది. ఆమె విధుల్లో నిర్లక్ష్యం ఉండటంతో పాటు తన భర్త చేస్తున్న తప్పుడు పనులను గుర్తించలేకపోయింది. ఈ క్రమంలోనే ఆ వార్డెన్ భర్త విద్యార్థినులకు మాయమాటలు చెప్పి వారిని ట్రాప్ చేసినట్లు సమాచారం.అంతేకాకుండా ఓ విద్యార్థినిపై లైంగికంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే..ఏలూరు జిల్లాలోని స్వామి దయానంద సరస్వతి హాస్టల్‌లో వార్డెన్ ఫణి శ్రీ భర్త శశికుమార్ అప్పుడప్పుడు హాస్టల్‌కు వచ్చి పనుల్లో భార్యకు సాయం చేసేవాడు. ఈ క్రమంలోనే విద్యార్థినిలకు మాయమాటలు చెప్పి గుట్టుగా వారిని ట్రాప్ చేశాడు.అందులో ఓ విద్యార్థినిని బాపట్ల ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.అయితే, వార్డెన్ ఫణి శ్రీ కూడా భర్తకు సహరించాలంటూ విద్యార్థినులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వార్డెన్, ఆమె భర్త శశికుమార్‌పై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version