సీఎం జగన్‌ ఓ దుర్మార్గుడు – అయ్యన్నపాత్రుడి సతీమణి

-

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడి ఇంటిని తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో చుట్టముట్టిన పోలీసులు.. ఆయణ్ను అదుపులోకి తీసుకున్నారు.

ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. అయితే.. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై ఆయన సతీమణి పద్మావతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

కొందరు పోలీసులు తాగి వచ్చారు, స్వామి మాలలో ఉన్న రాజేష్ తో ఎంతో అమర్యాదగా ప్రవర్తించారు. ఆది నుండీ ఈ ప్రభుత్వపు అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు అయ్యన్నపై కక్ష గట్టారని ఆమె ఆగ్రహించారు. అయ్యన్న పాత్రుడు గారికి గానీ, రాజేష్ కు గానీ ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత జగన్ రెడ్డి ప్రభుత్వానిదేనని విలపించారు అయ్యన్నపాత్రుడు సతీమణి శ్రీమతి పద్మావతి. సీఎం జగన్‌ ఓ దుర్మార్గుడు అని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version