భక్తులతో మలం తినిపించిన దొంగ బాబా అరెస్ట్

-

మూఢనమ్మకాలను వ్యాప్తి చేసే చాలా మంది దొంగ బాబాల గురించి మీరు వినే ఉంటారు. అలాంటి ఓ దొంగ బాబా ను థాయిలాండ్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ బాబా తన భక్తులకు తన మూత్రం తాగాలని మరియు మలం తినమని చెప్పవారు.తావీ నన్రా(75) అనే బాబా తనని తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. తన మలమూత్రాలు ఔషధంలా పనిచేస్తాయని ప్రకటించాడు. అతని నమ్మిన భక్తులు అతడి మలమూత్రాన్ని ముక్కు మూసుకొని మరీ తినేవారు.

చైయాఫమ్ లోని ఒక అడవిలో నివసిస్తున్నాడు ఈ దొంగ బాబా. అక్కడి క్యాంపుపై దాడిచేసి పోలీసులు ఈ దొంగ బాబా ని అరెస్టు చేశారు. ఆ బాబా ఉండేచోట 11 శవాలను గుర్తించారు పోలీసులు. అయితే తాజాగా ఈ బాబా వద్దకు వెళ్లిన ఓ మహిళ తిరిగి రాకపోవడంతో ఈ బాబా గురించి తెలిసిందని ఇన్ఫార్మర్ పోలీసులకు తెలిపాడు. ఆ దొంగ బాబా ను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version