బాలయ్య ప్రశ్నకు 2024లోనే పవన్ జవాబు?

-

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ షో..దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్‌తో ఆ షో ఓ రేంజ్ కి వెళ్లింది. ఇక త్వరలో బాలయ్య-పవన్ కల్యాణ్ కాంబినేషన్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ ఒకటి వచ్చింది. ఆ టీజర్‌లో బాలయ్య..పవన్‌కు ప్రశ్న వేశారు. 2019 ఎన్నికల్లో అభిమానుల ఓట్లు ఎందుకు పడలేదని పవన్‌కు ప్రశ్న వేశారు.

అయితే ఈ ప్రశ్నకు పవన్ ఎలాంటి సమాధానం చెబుతారో..ఫుల్ ఎపిసోడ్ లో తెలుస్తోంది. ఆ విషయం పక్కన పెడితే..బాలయ్య బాబు ప్రశ్నకు 2024లోనే జవాబు ఇస్తామని, ఈ సారి ఫ్యాన్స్ ఓట్లు ఒక్కటి కూడా పోనివ్వమని, ఈ సారి జనసేనకు వేస్తామని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏపీలో ఎక్కువ ఫ్యాన్ బేస్ పవన్ కల్యాణ్‌కు ఉంది. అలాగే ఆయన సభలు, ర్యాలీలు చేస్తే వేలాది మంది తరలివస్తారు

అబ్బో 2019 ఎన్నికల ముందు అలాగే పవన్ సభలకు ఎగడబడి వచ్చారు. పవన్ సీఎం సీఎం అని హడావిడి చేశారు. కానీ సభలకు అంతమంది వచ్చారు గాని..అవన్నీ ఓట్లుగా మారలేదు. ఆఖరికి పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారంటే..సొంత ఫ్యాన్స్ సైతం ఓట్లు పెద్దగా వేయలేదని తెలిసింది. ఈ విషయం పవన్ ఇప్పటికీ ప్రస్తావిస్తారు. సభలకు వస్తారు గాని, ఓట్లు మాత్రం వేయరని అన్నారు.

ఇప్పుడు అదే ప్రశ్న రూపంలో బాలయ్య పవన్‌ని అడిగారు. అందుకే ఈ సారి ఫ్యాన్స్ ఓట్లు ఏది పోకుండా..జనసేనకే పడతాయని అంటున్నారు. 2024 ఎన్నికల్లోనే బాలయ్య ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇస్తామని చెబుతున్నారు. చూడాలి మరి ఈ సారి ఫ్యాన్స్ ఓట్లు ఎలా పడతాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version