బండి సంజయ్‌ వివాదస్పద వ్యాఖ్యలు..సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం !

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇటీవల ప్రగతి భవన్‌ ను కూల్చేయాలని కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. సెక్రటేరియట్ పైన ఉన్న డోమ్‌లను కూల్చివేస్తాం.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తామన్నారు బండి సంజయ్‌

కూకట్ పల్లి లో పేదల భూములను కబ్జా చేశారు… వారి పైన కేసు లు పెడుతున్నారన్నారు. 11 వేల మీటింగ్ లు పెడతాం… బహిరంగ సభలు కాదని..ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీ కి పట్టం కడుతున్నారని తెలిపారు. brs మూర్ఖత్వ పాలనను ప్రజలకు వివరించేందుకు ఈ మీటింగ్ లు అని.. సీఎం ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ కు పరిమితం అయ్యారన్నారు. ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని..ఈ రోజుకి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదని ఆగ్రహించారు. తెలంగాణ కు 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుండే వస్తుంది… హైదరాబాద్ ను ఏ మేరకు అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version