జగనన్న కాలనీల భూసేకరణలో భూకుంభకోణంపై విచారణ జరిపించాలని కలెక్టర్ కు వినతపత్రం ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే డా.పార్థసారథి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం జరిగింది..రాష్ట్రంలో రూ.2,500 కోట్ల కుంభకోణం జరిగింది. ధర తక్కువగా ఉన్న భూమవులను గుర్తించి తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇచ్చారు. ఆదోని మండలం మండగిరి లో 65 మంది రైతుల నుంచి సేకరించారు. ఎకరా రూ.5లక్షలకు రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం రూ.13 లక్షల నుంచి రూ.23 లక్షలు నేతలు తీసుకున్నారు.
బ్యాంకు అకౌంట్ లు ఓపెన్ చేసి పాసుపుస్తకాలు నేతల దగ్గర పెట్టుకున్నారు. ఆదోని నియోజకవర్గంలోనే 23 కోట్లు ప్రభుత్వం ఇస్తే రైతులకు చేరింది 13 కోట్లు మాత్రమే. అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గాల్లో ఇలాగే రైతులను మోసాగించి నేతలు నొక్కేశారు. 175 నియోజకర్గాల్లో 2,500 కోట్ల కుంభకోణం జరిగింది. పేద రైతులకు దక్కాల్సిన డబ్బులు వైసీపీ నేతలు తినేశారు. వేలాది మంది రైతులను మోసం చేశారు. జగనన్న కాలనీ భూములకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి రూపాయి రైతుకు చేరాలి. కర్నూలు జిల్లాలో జరిగిన అక్రమాలపై కలెక్టర్ విచారణ జరిపించాలి అని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.