టెన్షన్ మొదలయింది.. అందుకే ఈ హడావిడి : బండి సంజయ్

-

ఇటీవలే భాగ్యనగర ఎన్నికల నగరా మోగటంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు ప్రతిపక్షం అధికార పార్టీలో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల నుండి బీజేపీ టీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మరోసారి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇటీవలే భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రజలందరూ మేయర్ పీఠాన్ని బీజేపీకీ కట్టబెట్టాలని భావిస్తున్నారని… కేసిఆర్ ఎన్ని సర్వేలు నిర్వహించినప్పటికీ కూడా అన్ని బిజెపికి అనుకూలంగానే వస్తూ ఉండటంతో కెసిఆర్ లో టెన్షన్ మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు బండి సంజయ్. అందుకే ఎంతో హడావిడి చేస్తున్నారని ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ విమర్శించారు,

Read more RELATED
Recommended to you

Exit mobile version