నాగోబా జాతరను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది : బండి సంజయ్‌

-

మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు అంటే కేసీఆర్ కు చులకన అని విమర్శించారు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అవుతుంటే, అడ్డుకునేందుకు కుట్ర చేశారని బండి సంజయ్ ఆరోపించారు. నాగోబా జాతరను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని బండి సంజయ్ అన్నారు. హిందూ జాతరలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు. కానీ నిజాం వారసుల మృతదేహాలను మాత్రం స్వాగతిస్తున్నారని వ్యాఖ్యానించారు. సెలబ్రిటీలు మరణిస్తే వెళతారు కానీ, గిరిజనుల ప్రాంతాల్లో మాత్రం పర్యటించరని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని మాట తప్పారని వెల్లడించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని హిందూ జాతరలు ఘనంగా నిర్వహిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నిర్వహిస్తున్న నాగోబా గిరిజన జాతరకు కేంద్రమంత్రి అర్జున్ ముండాతో కలిసి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ కు చివరివని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version