కేసీఆర్ పరివార్ వాది రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు : బండి సంజయ్‌

-

కేసీఆర్ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, బీఆర్ఎస్ అంటే బంధువులు రాబంధువుల సమితి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ టికెట్‌ను దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకు ఇవ్వడం, కోరుట్ల టికెట్ విద్యాసాగర్ రావు తనయుడి ఇవ్వడంతో కేసీఆర్ పరివార్ వాది రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

ఇది ఇలా ఉంటె, దేశ వ్యాప్తంగా 5 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చామని తెలిపిన ఎంపీ అర్వింద్.. ఇప్పటికే మూడున్నర కోట్ల ఇళ్లు నిర్మించామని పేర్కొన్నారు. మరో 50 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. పేదలకు ఇళ్లు ఇచ్చే విషయంలో కేసీఆర్ సర్కారు చాలా వెనుకబడిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో.. పేదలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుందని విమర్శించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version