బిగ్ బాస్ 6: అనాధగా మిగిలిన బిగ్ బాస్ కంటెస్టెంట్ కీర్తీ భట్ కన్నీటి గాధ..!

-

ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టం. ఒకరు ఉన్నట్టుండి ధనవంతులైతే.. మరి కొంతమంది ఉన్నట్టుండి అందరిని కోల్పోవడం.. నిరాశ్రయులు అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వారిలో ప్రముఖ బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ కీర్తీ భట్ కూడా ఒకరు. మనసిచ్చి చూడు అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ ముద్దుగుమ్మ ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో హిమా అనే అమాయకపు అమ్మాయి పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్-6 లోకి కంటెస్టెంట్ గా అవకాశం రావడంతో తన ఆనందం రెట్టింపైందని చెప్పవచ్చు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు హోస్ట్ నాగార్జున తన కెరీర్ కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ప్లే చేయగా అందులో ఆమె కన్నీటి గాథ చూసిన ప్రేక్షకుల చేత కన్నీటిని తెప్పించింది.కీర్తి భట్ అసలు పేరు కీర్తి కేశవ భట్.. 1992 జూలై 2వ తేదీన మంగళూరులో జన్మించిన ఈమె తన విద్యాభ్యాసాన్ని బెంగళూరులో పూర్తి చేసింది. ఇకపోతే ఒకసారి తన తల్లిదండ్రులతో పాటు సోదరి, సోదరుడితో కలిసి వెళుతుండగా కారు యాక్సిడెంట్ కి గురైంది. అక్కడ కీర్తి భట్ తప్ప మిగతా వారందరూ కూడా యాక్సిడెంట్లో మరణించారు. ఇక ఆ షాక్ కి గురైన కీర్తీ భట్ 3 నెలల పాటు కోమలోనే ఉండిపోయింది. ఇక ఆ తర్వాత ఎన్నో కష్టాలను పడి అవమానాలను ఎదుర్కొని చివరికి మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈమెకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఐస్ మహల్ అనే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా పెద్దగా విజయాన్ని సాధించకపోయినా.. కన్నడ సీరియల్స్ లో అవకాశాలు వచ్చేలా చేసింది.

ఇకపోతే తన కష్టాలు పగవాడికి కూడా రాకూడదని కోరుకునే కీర్తి భట్ ఒక అనాధ అమ్మాయిని దత్తత తీసుకొని , ఆ పాప ఆలనా పాలన చూసుకుంటుంది. ఇకపోతే ఆ పాపతోనే తన జీవితాన్ని కొనసాగిస్తోంది కీర్తి.

Read more RELATED
Recommended to you

Exit mobile version