కేసీఆర్ భారతీయ రాష్ట్రీయ సమితిపై బీజేపీ కౌంటర్‌

-

న్యూ ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్ భారతీయ రాష్ట్రీయ సమితిపై స్పందించారు బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్. కొత్త పార్టీలను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ముందు బంగారు తెలంగాణ స్వప్నాన్ని పూర్తి చెయ్యండని టీఆర్‌ఎస్‌ పార్టీకి చురకలు అంటించారు. 8 ఏళ్ళలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసిందని పేర్కొన్నారు.

ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లా అండ్ ఆర్డర్ సరిగా లేదన్నారు బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్. మహిళలపై సర్కార్ వాహనాల్లో లైంగిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అందరూ ప్రధాని కావాలని కలలు కంటున్నారు. ప్రజలు మోడీకే అవకాశం ఇచ్చారు, వచ్చే ఎన్నికల్లో మోడీనే మళ్ళీ పీఎంను చేస్తారన్నారు బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version