నేడు హనుమకొండలో విజయ సంకల్ప సభ సన్నాహక సమావేశం

-

హనుమకొండలో ఇవాళ విజయ సంకల్ప్ సభ సన్నాహక సమావేశం జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు హనుమకొండలో ఇవాళ పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నెల 8న ప్రధాని వరంగల్ పర్యటనకు నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. కాజీపేట అయోధ్యాపురంలో పీరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్ పనులకు మోదీ.. మోదీ శంకుస్ధాపన చేయనున్నారు. ఇప్పటికే  160 ఎకరాల చుట్టూ ప్రహారిగోడ నిర్మాణం చేశారు. తాత్కాలిక కార్యాలయాలనూ ఏర్పాటు చేశారు. 550 మీటర్ల పొడవుతో  షెడ్ నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయి.

ప్రధాని రాకను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ హనుమకొండకు విచ్చేసి.. ముందుగా  అయోధ్యాపురం వెళ్లి కాజీపేట రైల్వే యూనిట్  ప్రాంతాన్ని సందర్శిస్తారు. భూమి పూజ ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం హనుమకొండలో పార్టీ నేతలతో సన్నాహక సమావేశంలో పాల్లొంటారు. అంతేగాకుండా వెయ్యి స్తంభాల గుడిని సందర్శించి.. పలు అభివృద్ధి పనులను పరిశీలిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version