తెలంగాణ బీజేపీలో కాకరేపుతున్న అసమ్మతి నేతల మీటింగ్

-

తెలంగాణ బీజేపీలో అమస్మతి నేతల మీటింగ్ హాట్ టాపిక్ గా మారింది. గతంలో భేటీ అయిన నేతలే మరోసారి భేటీ అయినట్లు తెలుస్తోంది. కరీంనగర్ నేతలతో పాటు హైదరాబాద్ కి చెందిన నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం. సమావేశం లో పాల్గొన్న వారిలో గుజ్జుల రామ కృష్ణ రెడ్డి, సుగుణాకర్ రావు, వెంకట రమణి, రాములు మరికొందరు నేతలు ఉన్నారు. పార్టీ లో పాతవారికి ప్రాధాన్యత లేదని, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. కొత్తగా వచ్చిన వారిలో ఎందరు గెలుస్తారని అసమ్మతి నేతలు ప్రశ్నిస్తున్నారు. మేము పార్టీని వీడే ప్రసక్తే లేదని.. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడమే మా లక్ష్యం అని అంటున్నారు. మేము పని చేయనిదే పార్టీ అభివృద్ధి చెందిందా..అంటూ ప్రశ్నిస్తున్నారు. మాకు ఆత్మాభిమానం ఉంటుందని.. ఇది కొందరి సమస్య కాదని పార్టీలోని వందలాది మంది కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్య అని అసమ్మతి నేతలు అంటున్నారు. త్యాగాలు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మమ్మల్ని సమావేశాలకు పిలవడం లేదని.. పాత వాళ్లు పార్టీకి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version