బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తాము : కొండా సురేఖ

-

బోనాల పండగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. 2024 జులై 7వ తేదీ నుండి జరిగే బోనాల పండుగ ఏర్పాట్లను మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. తర్వాత మీడియాతో ఆమె మాట్లాడుతూ… బోనాల పండుగ ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయముతో ముందుకు వెళ్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంపుల్స్ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

గత ప్రభుత్వంలో లాగా అరకొర సౌకర్యాలతో కాకుండా ఈ సంవత్సరం మరింత వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు.రూ. 25 కోట్లు ఫండ్స్ విడుదల చేయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తాను మాట్లాడుతానని తెలిపారు. ఆర్టీసీ కుడా స్పెషల్ బస్సులు నడపాలని ఆదేశాలు జారీ చేస్తామని,త్వరలోనే బోనాల తేదీలు , పూర్తి సమాచారంతో కాలెండర్ ను విడుదల చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version