Breaking : మంత్రి కేటీఆర్‌కు క‌రోనా పాజిటివ్

-

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, దాంతో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని మంత్రి తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేటీఆర్ సూచించారు.

2021, ఏప్రిల్ 23న మంత్రి కేటీఆర్ క‌రోనా బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ తాజాగా ఆయ‌న మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఇదిలా ఉంటే మొన్నటి వరకు కరోనా కేసుల సంఖ్య మొన్నటి వరకు రోజు రోజుకు పెరుగుతూ వస్తుంటే.. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version