బ్రేకింగ్: ప్రముఖ గాయకుడు పద్మభూషణ్ జస్రాజ్ మృతి…!

-

మ్యూజిక్ లెజెండ్ పండిట్ జస్రాజ్ యుఎస్ లో మరణించారు అని ఆయన కుమార్తె దుర్గా జస్రాజ్ మీడియాకు వివరించారు. ఆయన వయసు 90 ఏళ్ళు. మేవతి ఘరానా (మ్యూజికల్ అప్రెంటిస్‌షిప్ వంశం) కు చెందిన భారతీయ శాస్త్రీయ గాయకుడు ఆయన. 80 ఏళ్ళకు పైగా ఆయన సంగీత వ్రుత్తిలో ఉన్నారు. ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో హర్యానాలోని హిసార్ లో ఆయన జన్మించారు.

1962 లో, జస్రాజ్ సినీ దర్శకుడు వి. శాంతారామ్ కుమార్తె మధుర శాంతారామ్ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు, ఒక కూతురు. అమెరికాలోని న్యూజెర్సీలో జస్రాజ్ 90 ఏళ్ళ వయసులో మరణించారు అనేక అవార్డులను ఆయన గెలుచుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.పండిట్ జస్రాజ్ జీ యొక్క దురదృష్టకర మరణం భారత సాంస్కృతిక రంగంలో తీవ్ర శూన్యతను మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసారు. అతని ప్రదర్శనలు అత్యుత్తమంగా ఉండటమే కాకుండా, అనేక ఇతర గాయకులకు అసాధారణమైన గురువుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు, కుటుంబానికి తన సంతాపం ప్రకటిస్తున్నట్టు ట్వీట్ చేసారు. ఓం శాంతి అంటూ ట్వీట్ ముగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version