బ్రేకింగ్: త్వరలో చైనా అధినేతతో ప్రధాని మోడీ భేటీ

-

భారత్-చైనా సరిహద్దు లో ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రెండు దేశాల అధినేతలు భేటీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. త్వరలోనే చైనా అధినేతతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదే విధంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్… చైనా మంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే.

china barath

ప్రధాని నరేంద్ర మోడీ కూడా చైనా అధినేతతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ భేటీ ఎక్కడ జరుగుతుంది అనే దానిపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. కానీ భారత్ చైనా సరిహద్దుల్లో ఈ భేటీ జరిగే అవకాశం ఉందని… పాంగ్యాంగ్ సరస్సు వద్ద ఈ భేటీ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం చైనా భారత సరిహద్దుల్లో ఉద్రిక్త ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనితో మోడీ పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version