తన బాబు సొమ్మేదో ఇచ్చినట్లు పుస్తకాలకు పార్టీ రంగులేంటి?

-

జగనన్న ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధు లివ్వకుండా వాటిని నిర్వీర్యం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు గానీ, ఎన్ఆర్ఈజీఎస్, మైనింగ్ సెస్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం డైరెక్ట్ గా సీఎఫ్ఎంఎస్ కే జమవుతోందని అన్నారు. కనీసం పారిశుధ్య పనులు కూడా చేయలేని దుస్థితిలో స్థానిక సంస్థలున్నాయని ఆయన అన్నారు.

ఎన్ ఆర్ ఈజీ ఎస్ కు చెందిన రూ.2,200 కోట్లను నిలిపే శారన్న ఆయన ఆర్థిక నేరగాడి ప్రభుత్వం నీతి వాక్యాలకే పరిమితమైంది తప్ప, అవినీతి పరులపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కాకినాడ్ సెజ్, విశాఖ బే పార్క్ లు హెటిరో, అరబిందోకు అప్పగించడం మరో క్విడ్ ప్రోకో విధానంలో భాగమేనని అన్నారు. అలానే తన బాబు సొమ్మేదో ఇచ్చినట్లు పాఠ్య పుస్తకాలకు పార్టీ రంగు లేయడం ఏమిటి? అని బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజకీయ నేతలపై ఉన్న అవినీతి కేసుల విచారణ వేగవంతం కావడం శుభపరిణామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version