కంటోన్మెంట్ ను టచ్ చేసి చూడు..మాడి మసైపోతావ్ : కేటీఆర్‌ కు బండి సంజయ్‌ వార్నింగ్‌

-

పార్టీ నేతలతో కలిసి ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసిన బండి సంజయ్…అనంతరం కేటీఆర్‌ కు కౌంటర్‌ ఇచ్చారు. కంటోన్మెంట్ మీ అయ్య జాగీరనుకున్నవా? టచ్ చేసి చూడు…. మాడి మసైపోతావ్ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం చేతగాని దద్దమ్మ కంటోన్మెంట్ లో కరెంట్ చేస్తానంటావా? పవిత్రమైన అసెంబ్లీ వేదికగా దేశాన్ని విచ్చన్నం చేసే కుట్ర అంటూ నిప్పులు చెరిగారు. ఖాసీం రజ్వీ, నిజాం రాజుకు పట్టిన గతే పడుతుందని.. తెలంగాణ ప్రజలు త్వరలోనే కేసీఆర్ పవర్ కట్ చేయడం ఖాయమని హెచ్చరించారు.

తక్షణమే రాష్ట్ర ప్రజలకు, సైనికులకు సీఎం క్షమాపణ చెప్పాలని.. భారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించడం అత్యంత దుర్మార్గమమని నిప్పులు చెరిగారు. ముమ్మాటికీ దేశద్రోహ చర్య అని.. దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తే….. తెలంగాణ ఫ్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఉరికించి ఉరికించి కొట్టడం ఖాయమని హెచ్చరించారు.

కంటోన్మెంట్ లో భూములు కబ్జాలు చేయాలి. ఫాంహౌజ్ లు కట్టుకోవాలి. పన్నులు పెంచాలి. నిధులు మళ్లించాలి. పేద ప్రజల రక్తం తాగాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు అని ఆగ్రహించారు. కేసీఆర్ కుటుంబాన్ని చూస్తుంటే నాకు అనుమానం వస్తోంది. వారందరికీ డీఎన్ఏ టెస్ట్ చేయాలని… ఒకాయనమో చైనాకు సపోర్ట్ చేస్తడు. ఇంకోకాయన పాకిస్తాన్ కు, ఆఫ్ఝనిస్తాన్ కు సపోర్ట్ చేస్తరు. రష్యా-ఉక్రెయిన్ యుద్దం జరిగితే అక్కడ మన విద్యార్థులు అల్లాడుతుంటే కనీసం స్పందించరు? అనినిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version