‘ కెమెరామెన్ గంగతో రాంబాబు ‘ రీ రిలీజ్.. ప్రతి టికెట్ పై వచ్చే 10 రూపాయలు జనసేనకే…!

-

పూరి జగన్నాథ్. దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ “కెమెరామెన్ గంగతో రాంబాబు”. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులు, అభిమానులను మరోసారి అలరించనుంది.త్వరలో తెలుగు రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ సినిమాని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 7న వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ చేయబోతున్నామని ప్రొడ్యూసర్ నట్టి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడుతూ…. “ఈ మూవీ కలెక్షన్స్ కు సంబంధించి సేల్ అయిన ప్రతి టిక్కెట్ నుంచి 10 రూపాయలు జనసేన ఫార్టీ ఫండ్ ను అందజేస్తామని ఆయన అన్నారు.

ఇక అభిమానులకు ప్రత్యేక విన్నపం ఏమిటంటే… . అసాంఘిక శక్తులు కావాలని ధియేటర్స్ ను నాశనం చేయాలని చూస్తే, అలాంటి వారిని థియేటర్ యాజమాన్యానికి,పోలీసులకు పట్టించండి, దేవాలయం లాంటి ధియేటర్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించింది. యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీ 2012వ సంవత్సరం అక్టోబర్ లో విడుదల అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version