వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి..

-

గత ఆరు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే ఇప్పటికే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పూడూరులో ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

పలువురు గాయపడ్డారు. అయితే ఇది గమనించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను జహిరాబీ (68), జావెద్‌ (12), ఉమర్‌ (6)గా గుర్తించిన పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version