జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు…

-

అనంతపురం : తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు అయింది. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు. మీసం మెలేస్తూ , రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ వైసిపి నాయకుల పిర్యాదు పై కేసు నమోదు చేశారు తాడిపత్రి పట్టణ పోలీసులు. ఈ మేరకు 153A, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తాడిపత్రి పట్టణ పోలీసులు.

కాగా.. శుక్రవారం అనంతపురం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ -2 తో పాటు జిల్లాలోని పది మున్సిపిపాలిటీల్లో రెండో వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి మినహా అన్ని చోట్ల అధికార వైసీపీ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో స్వతంత్ర అభ్యర్థి(టీడీపీ బలపరిచిన) ఎన్నిక కాగా.. ఇక్కడ ఎన్నిక ప్రక్రియను వైసీపీ కౌనిలర్లు బహిష్కరించారు. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీసం మెలేస్తూ.. వైసీపీ నేతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన పై వైసీపీ నేతలు కేసు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version