గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో 19 మంది పై కేసులు నమోదు..!

-

హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలు తొలుత ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆ తరువాత బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో మొత్తం 19 మంది అరెస్ట్ అయ్యారు. వారిలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు.

కౌశిక్ రెడ్డి తొలుత సవాల్ చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి నువ్వు మా ఇంటికి రాకుంటే.. నేను మీ ఇంటికి వస్తానని సవాల్ చేసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పలువురు కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి చేశారు టొమాటొ, గుడ్లతో దాడి చేయడంతో.. కొంత మంది రాళ్లతో దాడి చేయడం వ్లల కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించిన కిటికీ అద్దాలు ధ్వంసం అయినట్టు సమాచారం. కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి చేసిన వారందరినీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version