విజయసాయిరెడ్డికి సిబిఐ కోర్టు నోటీసులు

-

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణలో భాగంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కి సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఎంపీ విజయ సాయిరెడ్డి మరియు సి.బి.ఐ ని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ysrcp mp vijayasai reddy

ఈనెల పదవ తారీఖున ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని నరసాపురం వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారని పిటిషన్లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. అయితే దీనిపై ఇవ్వాళ విచారణ చేపట్టిన సిబిఐ కోర్టు ఎంపి విజయ సాయిరెడ్డి కి నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై ఎంపి విజయ సాయిరెడ్డి ఇంకా స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version