ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ

-

మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు రెండవసారి సిబిఐ విచారణకు హాజరయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి. వివేకానంద రెడ్డి హత్య కేసులో మధ్యాహ్నం హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సిబిఐ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు అవినాష్ రెడ్డిని ఐదు గంటలపాటు సిబిఐ ప్రశ్నించింది.

హైదరాబాద్ లోని కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వచ్చిన అవినాష్ ను.. సిబిఐ అధికారులు విచారించారు. విచారణకు న్యాయవాదులను అనుమతించాలని అవినాష్ రెడ్డి కోరారు. అయితే సిబిఐ అధికారులు మాత్రం అంగీకరించలేదు. సిబిఐ ఎస్పి రాంసింగ్ బృందం అవినాష్ రెడ్డిని ఐదు గంటల పాటు విచారించింది. అయితే బయటికి వచ్చిన అనంతరం తనను సిబిఐ అధికారులు మళ్లీ రావాలని చెప్పలేదని తెలిపారు అవినాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version