మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. సుశాంత్ కేసుకు వారే సరి..!

-

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పందించారు. సుశాంత్ కేసులో సీబీఐ విచారణ అక్కర్లేదని, ముంబయి పోలీసుల విచారణ సరిపోతుందని అన్నారు. ఇలాంటి కేసులను చేపట్టడంలో ముంబయి పోలీసులు సమర్థవంతులేనని చెప్పారు.

 

సుశాంత్ కు బాలీవుడ్ లో ఉన్న వృత్తి వైరం సహా అనేక కోణాల్లో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, సీబీఐతో విచారణ ఎందుకని ప్రశ్నించారు. సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంలో ఎవరి తప్పిదం ఉన్నట్టు తెలియరాలేదని… దర్యాప్తు మొత్తం పూర్తయ్యాక వివరాలు తెలుపుతామన్నారు అనిల్ దేశ్ ముఖ్. త్వరలో దర్యాప్తు పూర్తీ చేసి అన్ని వివరాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version