దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ, ఈడీ పలువురిని అరెస్ట్ చేసింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

దిల్లీ లిక్కర్ స్కామ్​లో అభియోగాలు ఎదుర్కొంటున్న కుల్దీప్‌సింగ్, నరేంద్రసింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్​లకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ముత్తా గౌతమ్​లను అరెస్టు చేయకుండానే సీబీఐ ప్రత్యేక కోర్టు సాధారణ బెయిల్ ఇచ్చింది. వీరిలో అరుణ్ పిళ్లైను ఇటీవల ఈడీ ప్రశ్నించింది. ఈ  కుంభకోణానికి సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ముత్తా గౌతమ్ మినహా మిగతా నిందితులు జ్యుడిషియల్ రిమాండ్​లో ఉన్నారు.

సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లికి ఇప్పటికే సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే వీరిద్దరూ మాత్రం ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్​లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version