ఆచార్య చాణుక్యుడు గొప్ప మేధావి, నైపుణ్యం కలిగిన వ్యూహకర్త. ఆయన రాసిన ‘చాణక్య నీతి’ శాస్త్రంలో మనుషుల ప్రవర్తన, సమాజంలో ఎలా బతకాలనే విషయాల గురించి ఎన్నో అమూల్యమైన సూత్రాలను అందించారు. నేటి ఆధునిక కాలంలో కూడా ఆయన చెప్పిన విషయాలు వంద శాతం నిజమవుతున్నాయి. అయితే, మన జీవితంలో కొందరికి అస్సలు సాయం చేయకూడదని, వారికి దూరంగా ఉండాలని చాణక్యుడు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
దురాశపరులకు రూపాయి కూడా ఇవ్వకండి: చాణక్యుడి నీతి ప్రకారం, జీవితంలో విపరీతమైన దురాశ, స్వార్థం ఉన్న వారికి ఎప్పుడూ సహాయం చేయకూడదు. ఇక ఇలాంటి వారు కేవలం తమ స్వార్థం కోసమే మిమ్మల్ని వాడుకుంటారు. పని ముగిశాక మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేయడానికి కూడా వెనుకాడరు. అందుకే ఇలాంటి దురాశపరులకు ఒక్క రూపాయి సాయం కూడా చేయకుండా, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

కృతజ్ఞత లేని వారితో డేంజర్: సమాజంలో కొందరికి ఎంత సాయం చేసినా కృతజ్ఞత (థాంక్స్) చెప్పే అలవాటు ఉండదు. అలాంటి కృతజ్ఞత లేని వారికి, ఎదుటివారికి విలువ ఇవ్వని వారికి ఎప్పుడూ సాయం చేయవద్దు. వీరంతా పక్కా స్వార్థపరులు. ఇక మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వీరు అస్సలు ముఖం చాటేస్తారు. అందుకే వీరికి సాయం చేసి ఆ తర్వాత బాధపడటం కంటే, ముందే అలర్ట్గా ఉండటం ఉత్తమం.
నిజాయితీ, అబద్ధాలు ఆడేవారికి వద్దు: తమ పనిలో నిజాయితీ లేని వారికి, నిరంతరం అబద్ధాలు చెప్పే వారికి ఎలాంటి సహాయం చేయకూడదని చాణక్యుడు అంటారు. ఇక అబద్ధాలతో బతికే వారిని అసలు మీ జీవితంలోకి కూడా రానివ్వకండి. వీలైనంత వరకు వారికి దూరంగా ఉండటమే మీ భవిష్యత్తుకు క్షేమకరం. ఇలాంటి వారి వల్ల సమాజంలో మీ గౌరవం కూడా తగ్గే ప్రమాదం ఉంది.
సహాయం చేయడం మంచి గుణమే అయినప్పటికీ, అది ఎవరికి చేస్తున్నామనేది చాలా ముఖ్యం. తప్పుడు వ్యక్తులకు చేసే సాయం మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అందుకే చాణక్యుడు చెప్పినట్టు స్వార్థపరులు, అబద్ధాలకోరులు, కృతజ్ఞత లేని వారికి దూరంగా ఉంటూ.. మంచి వారికి సాయం చేస్తూ జీవితంలో ముందుకు సాగాలి.
