చంద్రబాబు పరిపాలనంతా కరువు కాటకాలే – ఎంపీ మోపిదేవి

-

చంద్రబాబు పరిపాలనలో అంతా కరువు కాటకాలేనని విమర్శించారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. చంద్రబాబు హయాంలో అమరావతిలో రైతులను బెదిరించి వేల ఎకరాలు తీసుకున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఎన్ని పాదయాత్రలు చేసిన ప్రయోజనం ఉండదని అన్నారు. బాబు పాలనలో కరువుతో ప్రజలు అల్లాడి పోయే వారని అన్నారు.

చంద్రబాబుకు ఇక్కడ సొంత ఇల్లు కూడా లేదని.. సీఎం జగన్ అమరావతి లోనే ఇల్లు కట్టుకున్నారని అన్నారు. జగన్ ది మాటపై నిలబడే నైజం అని చెప్పారు. ఇదిలా ఉంటే మరోవైపు ఎంపీ ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ.. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసేదే అమరావతి ఉద్యమం అని, డబ్బులు ఇచ్చి పచ్చ కండువాలు వేసి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల ఏర్పాటు తద్యం అన్న ఎంపీ సత్యనారాయణ.. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అయితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version