మీడియాపై నిర్భయ కేసులా..? సీఎం జగన్ పై చంద్రబాబు ధ్వజం

-

మీడియాపై తప్పుడు కేసులు విధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ ప్రసారాలకు మూడు ఛానళ్లపై నిషేధం విధించారని, జీవో 2430 తెచ్చి మీడియాపై ఉక్కుపాదం మోపారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందని, మీడియా స్వేచ్ఛను హరించే నియంతృత్వ వైఖరులను తాము ఖండిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మీడియాపై నిర్భయ కేసులు బనాయించడం ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. తరగతి గదుల్లో పోలీసులు దుస్తులు ఆరేసిన ఘటనను ఫొటోలు తీసినందుకు విలేకరులపై కేసులు నమోదు చేయడాన్ని ఏమని భావించాలని ప్రశ్నించారు.

తునిలో విలేకరి హత్య జరిగిందని, చీరాలలోనూ ఓ మీడియా ప్రతినిధిని చంపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఓ పత్రిక ఎడిటర్ పై దాష్టీకం చెలాయించారని తెలిపారు. అధికారం చేపట్టిన తర్వాత సీఎం జగన్ నిరంకుశ విధానాలు, తిక్క చేష్టలతో రాష్ట్రం పరువు పోతోందని చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి నియంతలకు కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version