జగన్ ని ఇబ్బంది పెట్టేస్తున్న పొగడ్తలు, పాపం…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని పొగడ్తలు ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. జగన్ ని పొగడటం ఏమో గాని మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు చివరికి సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవ్వడం ఇప్పుడు వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంది. ఇటీవల తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన ఒక ప్రసంగం అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది.

గుండె ఆపరేషన్ చేయించుకున్నా స్టంట్ వేయించుకున్నా జగన్ జగన్ అని గుండె కొట్టుకుంటుంది అంటూ ఆమె మాట్లాడిన మాటలు శాసన సభలో వైసీపీ కార్యకర్తలు కూడా ఎందుకమ్మా ఈ భజన అంటూ మండిపడ్డారు. గతంలో కూడా ఆమె ఇదే విధంగా ప్రసంగించి విమర్శల పాలయ్యారు. ఇకపోతే జొన్నలగడ్డ పద్మావతి అనే ఎమ్మెల్యే కూడా ఇదే విధంగా ప్రసంగించి ఆశ్చర్యపరిచారు అందరిని.

నువ్వు అనుకుంటే అవుద్ది సామీ అంటూ శాసన సభలో ఆమె సినిమా డైలాగులు చెప్పారు. ఇక మహిళా ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ‘జీ తెలుగు’లో ప్రసారమయ్యే ‘రామసక్కని సీత’ సీరియల్‌లోని ఫేమస్ డైలాగ్‌ను సభలో చెప్పేశారు. ‘బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అధ్యక్షా.. ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది. పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలు అవుతాయి అధ్యక్షా..

అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది అధ్యక్షా.. కాని మన ప్రజలు పాలతో కలవాలో.. బొగ్గుతో కలవాలో నిర్ణయించుకుని స్వచ్ఛమైన పాలలాంటి మనసు ఉన్న జగన్ అన్నతో కలిసి నడిచారు అధ్యక్షా’ అంటూ వ్యాఖ్యానించారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు అయితే శుక్రవారం జగన్ కోర్ట్ కి వెళ్ళారు కాబట్టే 150 సీట్లు వచ్చాయని వ్యాఖ్యానించడం వైసీపీ కార్యకర్తలకు మండే విధంగా చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version