గట్టిగా పోరాడాం, నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు : చంద్రబాబు

-

ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగు దేశం ఘోర పరాజయం పాలైంది. కేవలం రెండే రెండు మునిసిపాలిటీలలో చెప్పుకోదగ్గ స్థానాలు సాధించింది. ఈ క్రమంలో చంద్రబాబు స్పందించారు. “తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలారా… స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మీలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారు. మీ పోరాట స్ఫూర్తికి వందనాలు” అని అన్నారు.

ప్రస్తుత ఫలితాల విషయానికి వస్తే, నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడాం అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదాం. ఇదే స్ఫూర్తితో పని చేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version