రాజ్యసభ ఎంపికపై చంద్రబాబు ఏమన్నారంటే..?

-

త్వ‌ర‌లో ఖాళీ కానున్న ఏపీలోని 4 రాజ్య‌స‌భ స్థానాల‌కు వైసీపీ ఎంపిక చేసిన అభ్య‌ర్థుల జాబితాపై విమ‌ర్శ‌లు గుప్పించారు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు. అయితే.. చంద్రబాబు ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. బుధ‌వారం క‌డ‌ప‌లో పార్టీ శ్రేణులు నిర్వ‌హించిన బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సంద‌ర్భంగా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు… రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక ప‌ట్ల వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఏపీలో రాజ్య‌స‌భ‌కు అర్హులైన వారే లేరా? అంటూ చంద్ర‌బాబు ప్రశ్నించారు. ఏపీలో రాజ్యస‌భ‌లో రాణించే స‌త్తా క‌లిగిన వారు లేనట్టు, నాయ‌కులే లేన‌ట్లు, వెనుక‌బ‌డిన వ‌ర్గాల నేత‌లు లేన‌ట్లు… జ‌గ‌న్ ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారిని ఎంపిక చేశార‌ని మండిపడ్డారు. త‌న‌ను ప్రశ్నించే వారే లేర‌న్న‌ట్లుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అగ్రహం వ్యక్తం చేశారు చంద్ర‌బాబు. ఈ త‌ర‌హా ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటున్న వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌న్న‌ద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version