చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు – మంత్రి మెరుగ నాగార్జున

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి మెరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేకనే చంద్రబాబు బూతులు తిడుతున్నాడని అన్నారు. రాజకీయంగా చంద్రబాబు దిగజారిపోయాడని మండిపడ్డారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపలేదని అన్నారు.

చంద్రబాబు చేసే కూయూక్తులు, మోసాలు, కుట్రలను అన్ని జనం గమనిస్తూనే ఉన్నారని అన్నారు. దుష్ట చతుష్టయాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రెచ్చిపోతున్నారని దుయ్యాబట్టారు. అంబేద్కర్ బావాజాలాన్ని అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. ఎస్సీలలో ఎవరైనా పుడతారా అన్న వ్యక్తి చంద్రబాబు అంటూ వండిపడ్డారు. ఎస్సీలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని.. అలాంటి చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version