హైదరాబాద్ శివార్ల మళ్ళీ చిరుత హల్చల్

-

ఇటీవల హైదరాబాద్ శివార్లలో, నడి రోడ్డుపై కనిపించిన చిరుత స్థానికంగా ఒక్క సారిగా కలకలం సృష్టించిందన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత అది ఎక్కడికి పారి పోయిందో ఇంత వరకు కూడా దాని జాడ మాత్రం దొరకడం లేదని చెప్పాలి. అయితే తాజాగా రాజేంద్ర నగర్ పరిధి వాలంతరి వద్ద మరో సారి చిరుత పంజా విసిరింది. నిన్న అర్ధ రాత్రి రెండు ఆవులు పై దాడి చేసి మెడలను పూర్తిగా తినేసిందని తెలుస్తోంది.

గత నెల రోజుల క్రితం చిరుత అదే స్థలంలో ఒక ఆవు పై దాడి చేసి వెళ్ళిందని అంటున్నారు. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. చిరుత పులి పంజా హద్దులను పసిగట్టిన స్థానికులు మళ్లీ చిరుత సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు చిరుత సంచరించిన తీరును అవులపై దాడిని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version