సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ జరిపించాలి : షబ్బీర్ అలీ

-

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆనాడు టీఆర్ఎస్ సర్కార్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ ద్వారా విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. సర్వే కోసం కేటాయించిన రూ.100 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని లేఖలో ఆరోపించారు.

దీనిపై దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు 4 లక్షల మంది సిబ్బంది పాల్గొన్నారని షబ్బీర్ అలీ వివరించారు. ప్రజల ఆధార్, రేషన్ కార్డు వివరాలు, బ్యాంకు సమాచారం, ఎల్‌పీజీ కనెక్షన్లు, వాహన రిజిస్ట్రేషన్ల సమాచారం, ఇతర వ్యక్తిగత వివరాలతో కూడిన 94 అంశాల సమాచారాన్ని సేకరించారని గుర్తుచేశారు. కానీ, ఆ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడూ వాటి వివరాలు బయట పెట్టలేదని, ప్రజల సున్నితమైన సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకు విక్రయించినట్లు అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version