ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్‌.. ఎంఎస్పీ యాక్ట్‌ను ప్రవేశపెట్టనున్న సీఎం జగన్‌

-

వర్షాల కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎంకు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. జూన్‌ నుంచి ఆగస్టు వరకూ రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 419.6 మి.మీ.కు.. ఈ ఏడాది కురిసిన వర్షపాతం 314.6 మి.మీ. కురిసింది. దీంతో.. 25శాతం తక్కువగా కురిసిన వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు.

కోనసీమ, కాకినాడ, పగో, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఇరిగేషన్‌ సదుపాయం ఉన్న చోట్ల వర్షాల కొరత ప్రభావం తక్కువ అని, అన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్ధ్యం 1174.58 టీఎంసీలు అని, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 507.88 టీఎంసీలు అని, కనీస మద్దతు ధర పై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ఎంఎస్పీ యాక్ట్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం.. సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ఎంఎస్పీ యాక్ట్‌ను ప్రవేశపెట్టాలన్నారు. రైతులకు నిర్ణయించిన కనీస మద్దతు ధర ఇవ్వకుంటే ఈ చట్టం ప్రకారం చర్యలు. పంటలకు కనీస మద్దతు ధరల అమలు విషయంలో ఆర్బీకేలది కీలక పాత్ర. దేశ వ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. రైతులకు, ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం.

అధిక రేట్లు ఉన్నా ప్రజలకు ఇబ్బంది రాకుండా కొనుగోలు చేస్తున్నాం. ఒక్క ఆగస్టు–2023లోనే రూ. 966.09 కోట్లు విద్యుత్‌ కొనుగోలు చేశాం. యూనిట్‌ ధర రూ.7.52లు పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నాం. ఎండలు అధికంగా ఉన్న మార్చి, ఏప్రిల్, మే, జూన్‌ నెలలో కూడా విద్యుత్‌ కొనుగోలు కోసం చేసిన ఖర్చు ఇంత లేదు. మార్చిలో రూ. 501 కోట్లు ఖర్చు చేస్తు, ఏప్రిల్లో రూ. 493 కోట్లు, మేలో రూ.430 కోట్లు, జూన్ నెలలో రూ. 346.28 కోట్లు, జులైలో రూ.197.57 కోట్లు ఖర్చు చేశాం. ఒక్క ఆగస్టు–2023లోనే రూ. 966.09 కోట్లు విద్యుత్‌ కొనుగోలు చేశాం. ఇంత ఖర్చు చేసి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. అయినా విస్తృతంగా నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version