ఈనెల 27న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్ కో ప్రాజెక్టు మూడవ యూనిట్ ను ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరుకానున్నారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

సీఎం జగన్ నెల్లూరు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఈనెల 27న ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం జగన్ హెలికాప్టర్ లో బయలుదేరతారు. ఉదయం 10:55 గంటలకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11: 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:20 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 3:30 గంటలకు తిరిగి తాడేపల్లి కి వస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version