ఆత్మకూరు ఉపఎన్నిక విజయంపై సీఎం జగన్ ట్వీట్

-

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. “మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుని చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా.. ఆత్మకూరులో 83 వేల మెజారిటీ తో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరునికి, ప్రతి స్నేహితుడికి.. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు.. పేరుపేరునా నా ధన్యవాదాలు అని ముఖ్యమంత్రి జగన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

 

మరో వైపు ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత మేకపాటి విక్రమ్ రెడ్డి కాస్త ఎమోషన్ కి గురయ్యారు. తన సోదరుడు గౌతంరెడ్డి ని గుర్తు చేసుకుని అన్న పేరు నిలబెడతాను అని ఉద్వేగానికి లోనయ్యారు. తనను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు విక్రమ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version