చిన్న జీయర్ స్వామిజీకి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు !

-

సామాజిక, సాహిత్య,సంగీతం భాష, ఆధ్యాత్మిక,సాంస్కృతిక, విద్యా,వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు సహా పలు ఇతర రంగాల్లో తమ జీవితకాలంలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి, ప్రతి ఏటా భారత ప్రభుత్వం అందించే “పద్మ” అవార్డులకు ఎంపికైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులకు పేరు పేరునా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు.

సంఘ జీవనం సాగిస్తున్న వ్యక్తులుగా తాము ఎంచుకున్న రంగాల్లో అత్యంత ప్రతిభను కనబరుస్తూ, చిత్తశుద్ధితో, బాధ్యతను గుర్తెరిగి తనవంతుగా సమాజాన్ని గుణాత్మక దిశగా ముందుకు నడిపించడంలో పద్మ’ అవార్డు గ్రహీతల పాత్ర ఎనలేనిదని సిఎం కే సి ఆర్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఆయా రంగాల్లో వారి విశేష కృషి రేపటి తరానికి మార్గదర్శకం గా నిలుస్తుందని, నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని సిఎం సూచించారు. అయితే, కేసీఆర్‌ తెలిపిన శుభాకాంక్షలు.. చిన్న జీయర్‌ స్వామికి కూడా దక్కుతాయి. ఎందుకంటే, ఆయనకు కూడా కేంద్ర పురస్కారం లభించిందన్న మాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version