నేడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం..BRSపై కీలక ప్రకటన

-

హైదరాబాద్ : ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్.. జరుగనుంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు, 33 జిల్లాల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు.

ఈ కీలక సమావేశంలో.. జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్‌ చర్చలు జరిపే అవకాశం ఉంది. దసరా రోజు.. బీఆర్‌ఎస్‌ పై ప్రకటన వస్తుందనే.. వార్తలు వస్తున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ ఇవాళ సమావేశం నిర్వహించడం ఆసక్తి కరంగా మారింది. అయితే.. ఈ సమావేశంలో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం.

ఇది ఇలా ఉండగా… నేడు గాంధీ జయంతి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ మరో మహోత్తరమైన కార్యక్రమానికి నాంది పలకనున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఇవాళ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్‌. ఈ నేపథ్యంలోనే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ అనంతరం.. బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version