దిక్కుమాలిన గుజరాత్ మోడల్ తో ప్రధాని అయ్యాడు… కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

దేశంలో తెలివితక్కువ మెదడు లేని ప్రభుత్వం ఉందని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఏదో గుజరాత్ మోడల్ ను అడ్డం పెట్టుకుని నరేంద్రమోదీ ప్రధాని అయ్యారని అన్నారు. గుజరాత్ మోడల్ పైన పటారం లోన లొటారం అని.. పేదలకు వ్యతిరేఖమైన మోడల్ అని కేసీఆర్ అన్నారు. గతంలో స్వాతంత్రం వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ఏం చేయలేదని.. గుజరాత్ ఏమో పొడిచేసినట్లు ఈ సిపాయి నరేంద్రమోదీ వచ్చాడని విమర్శించారు. సోషల్ మీడియా, దొంగ ప్రచారాలతోని గెలిచారని విమర్శించారు. ఆయనేదే చేస్తారని ప్రజలు నమ్మి ప్రజలు ఓటేశారన్నారు. ప్రస్తుతం 8 ఏళ్లు గడిచిపోయాయని..ఈయన బండారం బయట పడిందన్నారు.  10 ఏళ్లలో ఇది 8 వబడ్జెట్ అని ఇది దిక్కుమాలిన బడ్జెట్ అని అన్నారు. రైతులకు, పేదలకు మొండి చూపించారని అన్నారు. ఇది ఈ దేశం దురద్రుష్టం అని ఆయన అన్నారు. పవిత్రమైన గంగా నదిలో శవాలు తేలేలా చేసిందని విమర్శించారు. కరోనా సమయంలో వేలాది మంది చనిపోయారని… అంత దరిద్రమైన ప్రభుత్వం అని అన్నారు. దేశంలో మిడతలను ఎదుర్కొనే సోయి కూడా లేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version