జగన్‌ కు షాక్‌.. ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్‌ భేటీ !

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు ప్రస్తుతం ఢిల్లీ పర్యటన లో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న టీఆర్‌ఎస్‌ భవన్‌ శంకు స్థాపన నేపథ్యం లో సీఎం కేసీఆర్‌… ఢిల్లీ వెళ్లారు. అయితే…మొదట ఒక రోజే అనుకున్న ఈ ఢిల్లీ పర్యటన… మరో రెండు రోజులకు పెరిగింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.

ఈ నేపథ్యం లోనే మరో రెండు రోజుల పాటు తన పర్యటనను పొడగించుకున్నారు సీఎం కేసీఆర్‌. గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ పై ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్‌ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల పై ప్రధాని మోడీ తో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. ఇక ప్రధాని మోడీ తో భేటీ అనంతరం… రేపు ఢిల్లీ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. అనంతరం తెలంగాణ కు రానున్నారు సీఎం కేసీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version